Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో పెచ్చరిల్లిపోతున్న పరువు హత్యలు: సోదరీమణులను హతమార్చిన సోదరుడు

పాకిస్థాన్‌లో పరువు హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. పంజాబ్ ప్రావిన్స్‌లో ఇద్దరు సోదరీమణులను సోదరుడు దారుణంగా హతమార్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే పంజాబ్ ప్రావిన్సు‌కు చెందిన కోసర

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (10:33 IST)
పాకిస్థాన్‌లో పరువు హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. పంజాబ్ ప్రావిన్స్‌లో ఇద్దరు సోదరీమణులను సోదరుడు దారుణంగా హతమార్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే పంజాబ్ ప్రావిన్సు‌కు చెందిన కోసర్ (22), గుల్జార్ బీబీ (28)లనే ఇద్దరు సోదరీమణులు వారి కుటుంబ సభ్యులు తెచ్చిన బంధువుల సంబంధం కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 
 
తమ మాట వినకుండా ప్రేమించి పెళ్లాడారని కోపం పెంచుకున్న సోదరుడు నసీర్ హుసేన్ (35) ఇద్దరు సోదరీమణులను దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యలు పరువు కోసమే సోదరుడు చేశాడని పాక్ పోలీసులు తెలిపారు. పరువు కోసం తన కుటుంబాన్నే నాశనం చేశాడని మృతులు, నిందితుడి తండ్రి అట్టా ముహమ్మద్ చెప్పారు. పాకిస్థాన్‌లో ప్రతి ఏటా పరువు కోసమే వందలాదిమంది మహిళలు హత్యకు గురవుతున్నారని పోలీసులు వెల్లడించారు. 
 
పరువు కోసం ప్రతి ఏటా వెయ్యికి పైగా హత్యలు జరిగాయని, పరువు హత్యల పరిష్కారానికి పార్లమెంటులో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఆ దేశ న్యాయశాఖామంత్రి జాహీద్ హమీద్ చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments