Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి కుదిర్చారు... కానీ పెళ్లికి ముందే ఏకాంతంగా కనబడ్డారని చంపేశారు...

మానవ విలువలకు ఏమాత్రం స్థానం వుండదు పాకిస్తాన్ దేశంలో. అక్కడ ఎవడు ఎలా అనుకుంటే అలా జరిగిపోతుందంతే. ప్రాణానికి విలువే లేదు. క్షణాల్లో హత్య చేసి ఏమీ జరగనట్లు ప్రవర్తించేవాళ్లు ఎక్కువగా ఉంటుంటారు. ముఖ్యం

Webdunia
శనివారం, 6 జనవరి 2018 (14:37 IST)
మానవ విలువలకు ఏమాత్రం స్థానం వుండదు పాకిస్తాన్ దేశంలో. అక్కడ ఎవడు ఎలా అనుకుంటే అలా జరిగిపోతుందంతే. ప్రాణానికి విలువే లేదు. క్షణాల్లో హత్య చేసి ఏమీ జరగనట్లు ప్రవర్తించేవాళ్లు ఎక్కువగా ఉంటుంటారు. ముఖ్యంగా పాకిస్తాన్ దేశంలో పరువు హత్యలు రోజురోజుకీ ఎక్కువయిపోతున్నాయి. తాజాగా జరిగిన ఓ పరువు హత్య షాక్ కు గురి చేస్తోంది. ఎందుకంటే ఇది ప్రేమించుకున్నవారి విషయంలో జరిగింది కాదు. 
 
పెద్దలు కుదిర్చిన సంబంధంతో త్వరలో పెళ్లి చేసుకోవాల్సిన జంటను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన. వివరాల్లోకి వెళితే... సింధ్‌ ప్రావిన్స్‌లో నయీ వహీ గ్రామానికి చెందిన నజ్రీమ్‌ అనే యువతికి తన బంధువైన షాహిద్‌ అనే వ్యక్తితో పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. పెళ్లి జరిగేందుకు మరికొన్ని రోజులున్నాయి. 
 
ఐతే ఈలోపు ఈ జంట హాయిగా అలాఅలా ఊరి బయటకు విహారానికి వెళ్లింది. వాళ్లిద్దరూ ఊరి చివరకు వెళ్లి ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు. అంతే... వీరిని అలా చూసిన నజ్రీమ్ మేనమామ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. పెళ్లి కాక మునుపే ఏంటా ముచ్చట్లు అంటూ తుపాకి తీసి వారిని అత్యంత దారుణంగా కాల్చి చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కాగా పాకిస్తాన్ దేశంలో ఇలాంటి పరువు హత్యలు సర్వసాధారణమైపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments