Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోక్లాం వివాదం తర్వాత జిన్‌పింగ్‌తో నరేంద్ర మోడీ భేటీ

చైనాలోని షియామెన్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు. భారత్ చైనాల మధ్య తలెత్తిన డోక్లాం వివాదం తర్వాత జరిగనున్న తొల

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (11:28 IST)
చైనాలోని షియామెన్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు. భారత్ చైనాల మధ్య తలెత్తిన డోక్లాం వివాదం తర్వాత జరిగనున్న తొలి సమావేశం కావడం గమనార్హం. ఇందులో ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపనున్నారు. ముఖ్యంగా డోక్లాం వివాదం తర్వాత రెండు దేశాల అధినేతలు కలుసుకోనుండటం ఇదే తొలిసారి. 
 
మయాన్మార్‌కు బయలుదేరే ముందు ప్రధాని మోడీ మధ్యాహ్నం 12.30 గంటలకు జిన్‌పింగ్‌తో సమావేశమవుతారని భారత విదేశాంగశాఖ అధికారులు తెలిపారు. అయితే చర్చాంశాలు వెల్లడించేందుకు వారు నిరాకరించారు. ఇటీవల సిక్కిం సమీపంలోని డోక్లాంలో భారత, చైనా దళాలు నువ్వానేనా అన్నట్టుగా మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. 
 
ఇదిలావుండగా, బ్రిక్స్ శిఖరాగ్ర సభ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో విడిగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వారు ద్వైపాక్షిక వాణిజ్య అభివృద్ధి, పెట్టుబడులపై ప్రధానంగా చర్చించారు. ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితి కూడా ప్రస్తావనకు వచ్చిందని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్ మీడియాకు తెలిపారు. బ్రెజిల్ అధ్యక్షుడు మైకేల్ టెమర్‌తోనూ ప్రధాని మోడీ విడిగా సమావేశమయ్యారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments