Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోక్లాం వివాదం తర్వాత జిన్‌పింగ్‌తో నరేంద్ర మోడీ భేటీ

చైనాలోని షియామెన్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు. భారత్ చైనాల మధ్య తలెత్తిన డోక్లాం వివాదం తర్వాత జరిగనున్న తొల

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (11:28 IST)
చైనాలోని షియామెన్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు. భారత్ చైనాల మధ్య తలెత్తిన డోక్లాం వివాదం తర్వాత జరిగనున్న తొలి సమావేశం కావడం గమనార్హం. ఇందులో ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపనున్నారు. ముఖ్యంగా డోక్లాం వివాదం తర్వాత రెండు దేశాల అధినేతలు కలుసుకోనుండటం ఇదే తొలిసారి. 
 
మయాన్మార్‌కు బయలుదేరే ముందు ప్రధాని మోడీ మధ్యాహ్నం 12.30 గంటలకు జిన్‌పింగ్‌తో సమావేశమవుతారని భారత విదేశాంగశాఖ అధికారులు తెలిపారు. అయితే చర్చాంశాలు వెల్లడించేందుకు వారు నిరాకరించారు. ఇటీవల సిక్కిం సమీపంలోని డోక్లాంలో భారత, చైనా దళాలు నువ్వానేనా అన్నట్టుగా మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. 
 
ఇదిలావుండగా, బ్రిక్స్ శిఖరాగ్ర సభ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో విడిగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వారు ద్వైపాక్షిక వాణిజ్య అభివృద్ధి, పెట్టుబడులపై ప్రధానంగా చర్చించారు. ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితి కూడా ప్రస్తావనకు వచ్చిందని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్ మీడియాకు తెలిపారు. బ్రెజిల్ అధ్యక్షుడు మైకేల్ టెమర్‌తోనూ ప్రధాని మోడీ విడిగా సమావేశమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments