Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యంబారులో దుండగుడి కాల్పులు... పది మంది మృత్యువాత

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (13:43 IST)
నేరాలు, ఘోరాలకు అడ్డాగా ఉండే నైజీరియా దేశంలో దారుణం జరిగింది. ఓ మద్యంబారులో దండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో పది మంది మృత్యువాతపడ్డారు. వ్యానులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో సెంట్రల్ నైజీరియాలోని జోస్ సౌత్‌లోని బార్‌లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. 
 
ఈ కాల్పుల్లో 10 మంది మరణించారని నైజీరియా పోలీసు ప్రతినిధి ఉబాఒగాబా వెల్లడించారు. బార్‌లో కాల్పులు జరిపిన గన్‌మెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. కాల్పుల సమాచారం అందగానే భద్రతా సిబ్బంది, అప్రమత్తమయ్యారని.. వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారని నైజీరియా పోలీసు అధికారి వెల్లడించారు.
 
అయితే.. ఇటీవల కాలంలో కాల్పుల సంఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల దుండగులు జరిపిన కాల్పుల్లో దాదాపు 20 మంది వరకూ మరణించారు. ప్రస్తుతం బార్‌లో జరిగిన కాల్పుల సంఘటన నైజీరియాలో సంచలనం రేపింది. అయితే.. ఈ కాల్పుల వెనుక ఉగ్రవాద సంస్థలు ఉండే అవకాశముందని పలువురు వెల్లడిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments