Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నైజీరియాలో విద్యార్థుల కిడ్నాప్.. స్కూల్‌పై దాడి చేసి 200 మందిని..?

Advertiesment
Students
, సోమవారం, 31 మే 2021 (12:07 IST)
నైజీరియాలో విద్యార్థులను ఉగ్రమూకలు కిడ్నాప్ చేశారు. నైజీరియాలోని ఉత్తర నైగర్​ రాష్ట్రంలో ఉన్న‌ ఓ ఇస్లామిక్ పాఠ‌శాలపై దాడిచేసిన‌ దుండ‌గులు విద్యార్థులను కిడ్నాప్ చేశారు.

ఆదివారం టెజీనా న‌గ‌రంలోని సలిహూ తంకో ఇస్లామిక్ పాఠశాలపై సాయుధులైన వ్య‌క్తులు దాడి చేశార‌ని, సుమారు 200 మంది విద్యార్థులను ఎత్తుకెళ్లారని స్థానిక మీడియా సంస్థలు వెల్ల‌డించాయి.

మారణాయుధాలతో వచ్చిన ముష్క‌రులు పాఠశాలపై దాడి చేశారని పోలీస్ అధికారి వసియూ అబియోదిన్​ తెలిపారు. ఈ దాడిలో ఒక వ్యక్తి మృతిచెందారని పేర్కొన్నారు. విద్యార్థులకోసం గాలింపు చర్యలు ప్రారంభించామన్నారు.
 
ఇటీవ‌ల నైజీరియాలోని పాఠ‌శాల‌ల‌పై వ‌రుసగా దాడులు జ‌రుగుతున్నాయి. డ‌బ్బుకోసం దుండ‌గులు స్కూళ్ల‌పై వరుస దాడులకు, కిడ్నాప్​లకు పాల్పడుతున్నారు. గ‌త ఫిబ్ర‌వ‌రిలో జాంఫారా రాష్ట్రంలోని జాంగెబేకు చెందిన ఓ బోర్డింగ్ స్కూలు నుంచి 300 మంది బాలిక‌ల‌ను కిడ్నాప్ చేశారు. 
 
త‌ర్వాత వారిని వ‌దిలేశారు. ఏప్రిల్​ 20న అపహరించిన 14 మంది యూనివర్సిటీ విద్యార్థులను శనివారం విడిచిపెట్టారు. నైజీరియాలో గతేడాది డిసెంబర్ నుంచి కనీసం ఆరుసార్లు ఇలాంటి కిడ్నాప్‌లు జరిగాయని, 700 మందికి పైగా విద్యార్థులు అపహరణకు గురయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో జూన్ 30 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు