Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో హైస్కూల్‌పై దుండగుల దాడి.. 140మంది విద్యార్థులు కిడ్నాప్

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (11:15 IST)
నైజీరియాలో పాఠశాలలే లక్ష్యంగా విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా కడునా రాష్ట్రంలోని బెతేల్ బాప్టిస్ట్ హైస్కూల్‌‌పై సోమవారం తెల్లవారుజామున దుండగులు దాడి చేశారు. అక్కడ ఉన్న 165 మంది విద్యార్థులను అపహరించారు. 
 
ఆ రాష్ట్రంలోని బెథేల్ బాప్టిస్ట్ హైస్కూల్‌‌పై సోమవారం తెల్లవారుజామున దుండగులు దాడి చేశారు. కాల్పుల‌తో భ‌యాన‌క వాతావ‌ర‌ణం సృష్టించారు. దాడి నుంచి 26 మంది చిన్నారులు, పాఠ‌శాల సిబ్బంది తృటిలో త‌ప్పించుకున్నార‌ని స్థానికులు చెబుతున్నారు. కిడ్నాప్ చేసిన చిన్నారుల‌ను ర‌హ‌స్య ప్రాంతానికి త‌ర‌లించిన‌ట్లు అక్క‌డి మీడియా తెలిపింది.
 
కాగా.. ఈ ఘ‌ట‌న‌పై బెథెల్ బాప్టిస్ట్ హైస్కూల్‌‌ టీచర్ ఇమ్మాన్యుల్ మాట్లాడుతూ.. కిడ్నాపర్లు 140 మంది విద్యార్థులను తీసుకెళ్లారు. 26 మంది విద్యార్థులు మాత్రం తప్పించుకోగలిగారు. విద్యార్థులను దుండగులు ఎక్కడికి తీసుకెళ్లారో ఇంకా స‌మాచారం లేద‌న్నారు. విద్యార్థుల‌ను కిడ్నాప్ చేశార‌నే స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. ఎలా జ‌రిగింది అనే దానిపై ఆరా తీశారు. విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.
 
కాగా.. క‌దునా రాష్ట్రంలో గ‌డిచిన ఆరు నెల‌ల్లో విద్యార్థుల‌ను కిడ్నాప్ చేయడం ఇది నాలుగో సారి. గ‌తేడాది డిసెంబర్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ వెయ్యి మంది పిల్ల‌ల‌ను సాయుధులు అప‌హ‌రించుకుపోయారు. వీరిలో 200 మంది ఇప్ప‌టికీ క‌నిపించ‌డం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments