Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాపై పోరు.. గ్రెటాకు సమానమైన విరాళం.. ఎంతో తెలుసా?

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (17:46 IST)
కరోనాపై పోరుకు పర్యావరణ కార్యకర్త గ్రెట్ థన్‌బర్గ్  భారీ విరాళం ప్రకటించింది. ఈ మేరకు లక్ష డాలర్ల భారీ విరాళం ప్రకటించింది. హ్యూమెన్ యాక్ట్ అనే స్వచ్ఛంధ సంస్థ తనకు ఇచ్చిన లక్ష డాలర్ల బహుమానాన్ని యూనినెఫ్‌కు బదలాయిస్తున్నట్టు గ్రెటా తెలిపింది. కరోనా సంక్షోభం ప్రస్తుతం పిల్లలపై పెను ప్రభావం చూపిస్తోందని, దీర్ఘ కాలంలో బలహీన వర్గాలన్నీ దీని బారినపడతాయని గ్రెటా వ్యాఖ్యానించింది. 
 
వాతావరణం మార్పుల లాగానే కరోనా మహమ్మారి బాలల హక్కుల సంక్షోభానికి దారితీస్తోంది. నాతో పాటూ యూనిసెఫ్‌కు అందరూ  తోడ్పాటును అందించాలని గ్రెటా పిలుపు నిచ్చింది. చిన్నారుల చదువుల్ని, ఆరోగ్యాల్ని, వారి జీవితాల్ని కాపాడేందుకు మనందం నడుం బిగించాలని కోరింది. 
 
ఇకపోతే గ్రెటా విరాళంపై యూనీసెఫ్ స్పందించింది. లాక్‌డౌన్ల కారణంగా భాధ్యతల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు గ్రెటా సహాయం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపింది. మరోవైపు..గ్రెటాకు బహుమానం ఇచ్చిన హ్యూమన్ యాక్ట్ కూడా గ్రెటా బహుమతితో సమానమైన విరాళాన్ని ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది.

సంబంధిత వార్తలు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

తర్వాతి కథనం
Show comments