Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీస్‌లో కార్చిచ్చు.. 77మందికి పైగా మృతి.. మరో 150 మందికి తీవ్రగాయాలు

కార్చిచ్చు కారణంగా గ్రీస్‌లో 77మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మంది తీవ్ర గాయాలపాలైయ్యారు. కార్చిచ్చు చెలరేగడానికి కారణాలేంటో తెలియరాలేదని.. ఈ నేపథ్యంలో గ్రీస్ ప్రధాని అలెక్సిస్ టిసిప్రాస్ మూ

Webdunia
బుధవారం, 25 జులై 2018 (14:07 IST)
కార్చిచ్చు కారణంగా గ్రీస్‌లో 77మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మంది తీవ్ర గాయాలపాలైయ్యారు. కార్చిచ్చు చెలరేగడానికి కారణాలేంటో తెలియరాలేదని.. ఈ నేపథ్యంలో గ్రీస్ ప్రధాని అలెక్సిస్ టిసిప్రాస్ మూడు రోజులను సంతాప దినాలుగా ప్రకటించారు.
 
గ్రీస్‌లో సోమవారం మొదలైన దావానలం విస్తరించుకుంటూ పోతోంది. వేర్వేరు ప్రాంతాలకు పాకిన ఈ కార్చిచ్చు.. తీర ప్రాంత పట్టణమైన మాటీలో సముద్రం ఒడ్డున ఉన్న రిసార్టులో 26 మంది, ఏథెన్స్‌లో మరో 24 మందిని బలిగొన్నట్లు రెడ్ క్రాస్ అధికారులు తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో మరో 24 మందికి పైగా మృతి చెందినట్టు సమాచారం. 
 
కార్చిచ్చును అదుపు చేసేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. గత 2007లో సంభవించిన కార్చిచ్చులో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మళ్లీ దావానలం రేగడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. కార్చిచ్చు ధాటికి భయభ్రాంతులకు గురైన సమీప ప్రాంతాల ప్రజలు గ్రామాలను ఖాళీ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments