Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొటబాయ రాజపక్సేకు షాకిచ్చిన సింగపూర్

Webdunia
సోమవారం, 18 జులై 2022 (13:38 IST)
దేశాన్ని పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో నెట్టేసి ఆ దేశం నుంచి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలుత ఆయన కొలంబో నుంచి మాల్దీవులకు వెళ్లారు. అక్కడ శ్రీలంక జాతీయులు ఆయనకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చిన నిరసన తెలిపారు. దీంతో ఆయన అక్కడ నుంచి సింగపూర్‌లో అడుగుపెట్టారు. 
 
అయితే ఇప్పుడు ఆయన తమ దేశం వీడాలని సింగపూర్ కోరుకుంటోంది. ఆయన తమ దేశంలో ఉండేందుకు గడువును పొడిగించలేమని ఆ దేశ అధికారులు గొటబాయకు తేల్చిచెప్పినట్లు సమాచారం. 
 
శ్రీలంక ప్రజల ఆగ్రహ జ్వాలలను తట్టుకోలేని గొటబాయ.. భార్యతో కలిసి మొదట మాల్దీవులకు వెళ్లిపోయారు. ఆ తర్వాత గురువారం సింగపూర్ చేరుకున్నారు. ఆ దేశంలో దిగే సమయానికి ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయలేదు. ఆయన అధ్యక్ష హోదాలో వ్యక్తిగత పర్యటనకు వచ్చారని అప్పుడు సింగపూర్ ప్రభుత్వం చెప్పింది. 
 
అయితే ఆయన మరికొన్ని రోజులు తమ దేశంలో ఉండేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఆయన ఆశ్రయం కోరలేదని, తాము కూడా ఎలాంటి ఆశ్రయం ఇవ్వలేదని సింగపూర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆయన కొద్ది రోజుల క్రితమే అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో సింగపూర్‌ నుంచి ఈ స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments