యూఏఈ వెళ్లే చిన్నారులకు శుభవార్త!.. కోవిడ్ టెస్టులు అవసరం లేదు

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (13:14 IST)
యూఏఈ వెళ్లే చిన్నారులకు శుభవార్త భారత్ నుంచి తమ దేశానికి వచ్చే 12 ఏళ్లలోపు వారికి కోవిడ్ టెస్ట్ అవసరం లేదని యూఏఈ ప్రకటన చేసింది.

ఈ మేరకు అధికార ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఓ ప్రయాణికుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన యూఏఈ ప్రభుత్వం..ప్రస్తుతం సవరించిన నిబంధనల మేరకు 12 ఏళ్లు పైబడిన వారికే కోవిడ్ టెస్టులు తప్పనిసరి అంటూ స్పష్టతనిచ్చింది. అయితే..ఈ విషయంలో ఏమైనా మార్పులు ఉంటే అధికారిక వెబ్ సైట్లలో వివరాలు వెల్లడిస్తామని కూడా తెలిపింది.

భారత్ నుంచి దుబాయ్, అబుధాబి, షార్జా వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ ఫలితాలను సమర్పించాల్సి ఉంటుందని యూఏఈ వివరించింది.

ఇక 12 ఏళ్ల పైబడిన వారికి మాత్రం భారత ప్రభుత్వం ఆమోదించిన ల్యాబ్ ల ద్వారా కోవిడ్ 19 పీసీఆర్ టెస్టులు తప్పనిసరి అని క్లారిటీ ఇచ్చింది. అది కూడా ప్రయాణానికి 96 గంటలలోపు టెస్ట్ ఫలితాలనే పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments