Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచానికి రష్యా తీపికబురు.. ఆగస్టులో వాక్సిన్.. మిగిలిన ప్రపంచానికి సెప్టెంబరులో

ప్రపంచానికి రష్యా తీపికబురు.. ఆగస్టులో వాక్సిన్.. మిగిలిన ప్రపంచానికి సెప్టెంబరులో
, శుక్రవారం, 17 జులై 2020 (08:06 IST)
ప్రపంచానికి రష్యా తీపికబురు పంపింది. కోవిడ్ 19 వాక్సిన్ తమ దేశానికి ఆగస్టులోనూ, మరికొన్ని దేశాలకు సెప్టెంబర్ లోనూ అందించగలమని మరోసారి ప్రకటించింది.

కోవిడ్ మహమ్మారి తాకిడితో అల్లాడిపోతున్న ప్రపంచానికి తీపి కబురులా వినిపించే ఈ సమాచారాన్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్వయంగా వెల్లడించింది. రష్యా వాక్సిన్ తొలిదశ ప్రయోగాల్లో పాల్గొన్న 38 మంది కరోనా వైరస్ దాడిని నిలువరించగలిగే శక్తిని గణనీయమైన స్థాయిలో కనబరిచారని ఈ ప్రయోగాలు ఇచ్చిన ఫలితాలను ఆధారం చేసుకునే తమ దేశం ఆగస్టు నాటికి తొలి వాక్సిన్ అందివ్వగలమనే విశ్వాసాన్ని పెంచుకున్నామని రష్యా పేర్కొంది.

రెండో దశ హ్యూమన్ ట్రయల్స్ వంద మందిపై జరుగుతున్నాయి. అవి ఆగస్టు 3 నాటికి పూర్తవుతాయి. ఆ తర్వాత మూడో దశ ప్రయోగాలను ప్రారంభించి ఆగస్టులోనే 30 లక్షల వ్యాక్సిన్ లను ఉత్పత్తి చేస్తారు. ఇంకో 170 వేల వాక్సిన్లను ఇతర దేశాలు ఉత్పత్తి చేస్తాయి.

ఈ మొత్తం వాక్సిన్లను రష్యాతో పాటు ఇంకొన్ని దేశాల ప్రజలకు ఇస్తారు. కాగా రేసులో అన్నిటికంటే ముందున్న ఆక్స్ ఫర్డ్ వాక్సిన్ ప్రస్తుతం మూడో దశ ప్రయోగాల్లో ఉంది. వివిధ దేశాల్లో మొత్తం 30 వేల మందిపై ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. 
 
ఆక్స్‌ఫర్డ్‌  వ్యాక్సిన్‌తో రెట్టింపు రక్షణ
బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు టీకా అభివృద్ధిలో ముందడుగు వేశారు. వారు రూపొందించిన వ్యాక్సిన్‌తో కరోనా వైరస్‌ నుంచి 'రెట్టింపు రక్షణ' లభిస్తుందని మానవులపై నిర్వహించిన తొలి దశ ప్రయోగాల్లో తేలింది. యాంటీ బాడీలతోపాటు వైరస్‌ హంతక 'టి' కణాలను ఉత్పత్తి చేసేలా శరీరాన్ని ఈ టీకా ప్రేరేపిస్తున్నట్లు పరిశోధకులు చెప్పారు. 
 
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్‌-19కు సరైన టీకాను అందించే దిశగా బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు ముందడుగు వేశారు. వీరు రూపొందించిన వ్యాక్సిన్‌తో కరోనా వైరస్‌ నుంచి 'రెట్టింపు రక్షణ' లభిస్తుందని మానవులపై నిర్వహించిన తొలి దశ ప్రయోగాల్లో తేలింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఏం జరుగుతోంది? రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు, 40 మంది మృతి