Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ మాజీ ప్రధాని గిలానీకి కరోనా పాజిటివ్

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (20:28 IST)
పాకిస్థాన్ దేశంలో కూడా కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో ఆ దేశ రాజకీయ నాయకులకు కరోనా భయం పట్టుకుంది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలకు ఈ వైరస్ సోకింది. ఇపుడు ఆ దేశ మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ కూడా కరోనా బారినపడ్డారు. గిలానీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆయన కుమారుడు కాసిమ్ గిలానీ వెల్లడించారు. 
 
అయితే, తన తండ్రికి కరోనా వైరస్ సోకడంపై కాసిమ్ గిలానీ స్పందిస్తూ ఆ దేశంలోని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. 'ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి, నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరోకి కృతజ్ఞతలు. మా నాన్న జీవితాన్ని మీరు విజయవంతంగా ప్రమాదంలోకి నెట్టగలిగారు. ఆయన కరోనా పరీక్ష పాజిటివ్ అని వచ్చింది' అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
 
కాగా, ఇటీవల పీటీఐ, పీఎంఎల్ ఎన్ పార్టీల నేతల్లో చాలామంది కరోనా బారినపడిన విషయం తెల్సిందే. ప్రధాన విపక్ష నేత, పీఎంఎల్ ఎన్ పార్టీ అధినేత షహబాజ్ షరీఫ్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మాజీ ప్రధాని షాహిద్ ఖఖాన్ అబ్బాసీ, రైల్వే మంత్రి షేక్ రషీద్ సైతం కరోనా బాధితుల జాబితాలో చేరారు. 
 
పాకిస్థాన్‌లో మొట్టమొదటి కేసు ఫిబ్రవరి 26న వెలుగు చూడగా, అప్పటి నుంచి ఇప్పటివరకు 1,32,405 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,551 మంది మృత్యువాత పడగా, 50 వేల మందికి పైగా కోలుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments