Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాటలతో మాయచేసి.. టీలో మత్తుమందు కలిపి.. శీలాన్ని దోచుకున్నాడు...

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (15:37 IST)
ఆ మహిళను మాటలతో మాయచేశాడు. సమస్యలను పరిష్కరిస్తాను ఇంటికి రమ్మన్నాడు.. ఆయన మాటలు నమ్మి ఇంటికెళ్తే తేనీరులో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఫ్లోరిడాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఫ్లోరిడాకు చెందిన జీన్ ఫిలిప్స్ అనే వ్యక్తికి దైవభక్తి ఎక్కువ. దీంతో ఆయన వద్దకు అనేక మంది స్థానికులు వచ్చిన తమ సమస్యల పరిష్కారం కోసం సలహాలు సూచనలు అడిగి వెళుతుంటారు. ఇదేవిధంగా ఓ మహిళ ఆయన వద్దకు వెళ్లింది. ఆమెను మాటలతో మాయచేశాడు. 
 
తన మాట దేవుడు వింటాడని, తను ప్రార్థిస్తే ఖచ్చితంగా ఎవరి కష్టాలనైనా ఇట్టే తీర్చేస్తాడని ఆ మహిళను నమ్మించాడు. ఆయన మాటలను గుడ్డిగా నమ్మిన ఆ మహిళ ఓ రోజున ఆ వ్యక్తి ఇంటికి పిలవడంతో వెళ్లింది. 
 
ఇంటికొచ్చిన ఆమెను సోఫాలో కూర్చోబెట్టి తేనీరు ఇచ్చింది. ఈ టీ తాగడంతో ఆ మహిళ స్పృహ కోల్పోయింది. రెండు గంటలు తర్వాత మెలకువ వచ్చి చూస్తే ఇంట్లోని పడగ గదిలో నగ్నంగా ఉంది. దీంతో తాను మోసపోయానని, తాను అత్యాచారానికి గురైనట్టు గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. 
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, గతంలో కూడా అనేక మంది మహిళలను ఇదేవిధంగా మోసం చేసినట్టు తేలింది. దీంతో ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments