Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం సెలవు ఇవ్వలేదనీ రూ.152 కోట్ల అపరాధం... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (16:05 IST)
ఓ మహిళా ఉద్యోగినికి ఆదివారం సెలవు ఇవ్వకుండా పని చేయించుకున్నందుకు కంపెనీకి రూ.152 కోట్ల అపరాధం విధిస్తూ ఓ కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓ కోర్టు వెలువరించింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైతీ దేశానికి చెందిన మేరీ అనే ఓ మహిళ ఫ్లోరిడాలోని మియామీకి వలస వచ్చింది. అక్కడే ఉన్న ఓ నక్షత్ర హోటల్‌లో పనిలో చేరింది. ఆమె విధుల్లో చేరిన కొత్తల్లో ఆదివారం సెలవు ఇచ్చింది. హోటల్‌లో ఆరు రోజులు, చర్చిలో ఆదివారం పని చేస్తూ పోషణ సాగిస్తూ వచ్చింది. 
 
ఆ తర్వాత హోటల్ కిచెన్ మేనేజరుగా వచ్చిన కొత్త వ్యక్తి ఆ మహిళకు ఆదివారం సెలవును రద్దు చేసి.. పనికి రావాలంటూ ఆదేశించారు. ఆదివారం పనిచేయడం తమ మతాన్ని అగౌరవించినట్లు అవుతుందని మేరి చర్చి ఫాదర్ చేత లేఖ రాయించారు.
 
అయినప్పటికీ ఆ మేనేజరు అంగీకరించకుండా పనికి రప్పించుకునేవాడు. దీంతో దాదాపు పదేళ్ల పాటు ఆ మహిళ సెలవు లేకుండా పని చేసింది. అయితే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఆమె తోటి సిబ్బంది సాయంతో ఆదివారం సెలవు తీసుకుంటూ వచ్చింది. 
 
ఈ విషయం తెలుసుకుని ఆగ్రహంతో ఊగిపోయిన సదరు మేనేజర్ మేరీని విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బాధితురాలు ఈఈఓసీ (సమాన ఉద్యోగ అవకాశ కమిషన్‌)ను ఆశ్రయించింది.
 
ఈ కేసును విచారించిన ఫ్లోరిడా ఫెడరల్ కోర్టు మేరీ మనోభావాలను దెబ్బతీయడంతో పాటు అదనంగా పనిచేయించినందుకు 21.5 మిలియన్ డాలర్లు(రూ.152.95 కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాలని హోటల్ యాజమాన్యాన్ని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments