Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘన్‌లో మహిళా జడ్జీల కోసం సాగుతున్న తాలిబన్ల వేట

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (10:39 IST)
గత రెండు దశాబ్దాల కాలంలో తమకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన, శిక్షలు విధించిన మహిళా జడ్జీల కోసం తాలిబన్ తీవ్రవాదులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇలాంటివారిలో ఇప్పటికే అనేక మంది దేశాన్ని వీడిపోయారుకూడా. మిగిలిన వారు ప్రాణాలు అరచేతలో పెట్టుకుని బతుకు జీవుడా అంటూ దొంగచాటుగా జీవిస్తున్నారు. ఇలాంటి వారంతా రహస్య ప్రాంతాల్లో దాక్కుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. 
 
ఆప్ఘన్ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత ఎంతోమంది నేరగాళ్లకు విముక్తి ప్రసాదించారు. వారిని జైళ్ల నుంచి విడుదల చేశారు. అలా విడుదలైన వారిలో దాదాపుగా అందరూ గతంలో తాలిబన్ల తరపున పనిచేసినవారే. వివిధ నేరాల్లో దోషులుగా తేలిన వీరికి శిక్ష విధించడమే మహిళా న్యాయమూర్తులు చేసిన పాపం. 
 
జైలు నుంచి విడుదలైన నేరస్థులు.. ప్రస్తుతం మహిళా న్యాయమూర్తుల కోసం గాలిస్తున్నారు. తమకు శిక్ష వేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో 220 మందికిపైగా మహిళా న్యాయమూర్తులు ప్రాణ భయంతో దాక్కున్నారని అంతర్జాతీయ మీడియా తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటీనటులకు ప్రభుత్వం ఏమి చేయాలో చెప్పనవసరం లేదు- సిద్ధార్థ్

ప్రణీత్ హనుమంతుపై ఫైర్ అయిన సుధీర్ బాబు.. చీడపురుగు అంటూ?

ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా చిత్రం.. స్పిరిట్‌లో కొరియన్ యాక్టర్?

ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ చీరలో బుట్టబొమ్మ

కమల్ హాసన్‌ వాయిస్‌తో అదరగొట్టిన హాస్యబ్రహ్మ... video

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పనస పండు ఆరోగ్య ప్రయోజనాలు

వెల్లుల్లి వాసన పడదా.. మహిళలు రెండు రెబ్బలు తింటే?

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

తర్వాతి కథనం
Show comments