Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికన్లకు భారతీయుల కుచ్చుటోపీ : రూ.500 కోట్ల మోసం

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (12:48 IST)
అమెరికన్లను మోసం చేసి రూ.500 కోట్ల మేరకు మోసం చేసిన కేసులో ముగ్గురు మహా మోసగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేరానికి పాల్పడిన ముగ్గురిలో ఇద్దరు భారతీయులే ఉండటం శోచనీయం. 
 
మోహిత్ దేవేంద్రభాయ్ శర్మ, కునాల్ జగదీశ్‌భాయ్ శర్మ అనే ఇద్దరు వ్యక్తులు గుజరాత్ కేంద్రంగా ఓ కాల్ సెంటర్‌ని ఏర్పాటు చేశారు. కెనడాకు చెందిన జూలియట్ బెల్లె కార్టర్ అనే మరో వ్యక్తిని కూడా తమతో చేర్చుకున్నారు. కార్టర్ సహాయంతో అమెరికన్ల వ్యక్తిగత వివరాలను సేకరించడం ప్రారంభించారు. ఎంచుకున్న వ్యక్తులకు ఫోన్ చేసి అమెరికా రెవెన్యూ విభాగానికి మీరు పన్నులు సరిగ్గా కట్టలేదని ఇలా చేస్తే శిక్షపడుతుందని బెదిరించసాగారు. 
 
బాధితులు భయపడి వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేశారు. ఇలా ఒకరూ ఇద్దరూ కాదు దాదాపు 15 వేల మందిని వీరు ముగ్గురూ కలిసి మోసం చేసారని సమాచారం. ఈ కుంభకోణం విలువ రూ.500 కోట్లకు పైగా ఉందని పోలీసులు తెలిపారు. మోసాన్ని గుర్తించిన అమెరికా అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. కార్టర్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అదేవిధంగా మోహిత్ దేవేంద్రభాయ్ శర్మ, కునాల్ జగదీశ్‌భాయ్ శర్మ అనే ఇద్దరు భారతీయులను కూడా అరెస్టు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments