Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుల భాధతో భార్య సూసైడ్.. గుండెపోటుతో భర్త మరణం

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (12:42 IST)
అప్పుల బాధ తట్టుకోలేక ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చావు ప్రయాణంలో కూడా భార్యాభర్తలు ఇద్దరూ కలిసే వెళ్లారు. బ్రతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లి అప్పులతో తిరిగి వచ్చాడు ఇంటి యజమాని. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం దగ్గి గ్రామానికి చెందిన కుర్మ శివరాజయ్య(42) బ్రతుకు తెరువు కోసం మూడేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ పని దొరకక అప్పుల బాధతో తిరిగి వచ్చాడు. రుణదాతల ఒత్తిడి ఎక్కువవడంతో తన కొడుకుని దుబాయ్ పంపించాడు. శివరాజయ్య, అతని భార్య లింగవ్వలు అప్పుల విషయమై బాధపడుతూ సోమవారం రాత్రి నిద్రకు ఉపక్రమించారు. 
 
శివరాజయ్య నిద్రపోతుండగా లింగవ్వ అతనికి తెలియకుండా పురుగుల మందు తాగింది. భర్తకు మెలుకువ వచ్చి చూడగా ఆమె కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ చనిపోయింది. ఆ ఘటన చూసి శివరాజయ్యకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించాడు.
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments