Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాల్వాన్ లోయలో 100 మంది చైనా సైనికుల మృతి???

Webdunia
మంగళవారం, 7 జులై 2020 (08:44 IST)
గత నెల 15వ తేదీన తూర్పు లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో భారత్ - చైనా బలగాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో భారత్ సైన్యానికి చెందిన 21 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, చైనా వైపున కూడా అధిక సంఖ్యలో ప్రాణనష్టం సంభవించిందని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా, 40 నుంచి 45 మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే, మృతుల సంఖ్యపై చైనా ఎన్నడూ పెదవి విప్పలేదు. 
 
ఈ క్రమంలో చైనా పీపుల్స్ ఆర్మీకి చెందిన రిటైర్డ్ అధికారి క్సీ ఒకరు తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. చైనాకు చెందిన సైనికులు 100 మందికి పైగా ఈ ఘర్షణలో చనిపోయారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఇదేసమయంలో చైనా ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని కూడా ఆరోపించారు. గాల్వాన్ వ్యాలీలో అసలు ఏం జరిగిందన్నది చైనా తరపు నుంచి ఎన్నడూ బయటకు రాదని ఆయన అన్నారు.
 
గాల్వాన్ లోయలో పెద్ద యుద్ధమే జరిగిందనీ, అక్కడ 100 మందికిపైగా చైనా సైనికులు మరణించారని వెల్లడించిన సీపీఏ మాజీ సైనికుడు క్సీ, ఆ ప్రాంతానికి చైనా మరిన్ని బలగాలను తరలించినా, అక్కడి పరిస్థితులు ఇండియాకే అనుకూలమని అన్నారు. క్సీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments