Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రంలో ఇథియోపియా ఎయిర్‌లైన్ : 157 మంది ప్రయాణికుల గల్లంతు

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (15:39 IST)
ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. ఇథియోపియా రాజధాని అడీస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఇథియోపియా ప్రధాని కార్యాలయం అధికారికంగా విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఈ విమాన ప్రమాదంలో 157 మంది ప్రయాణికులంతా చనిపోయివుంటారని భావిస్తున్నారు. విమాన ప్రమాదంలో తమ కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఇథియోపియా ప్రధాని అబి అహ్మద్ కార్యాల‌యం ట్విటర్ వేదికగా వెల్ల‌డించింది. ప్రమాద సమయంలో విమానంలో 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నట్లు విమానయాన సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. 
 
స్థానిక కాలమానం ప్రకారం.. అడిస్ అబాబాలోని బోలె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం 8:38 గంటలకు విమానం గాల్లోకి లేచిందని.. ఆ తర్వాత కొంతసేపటికే 8:44 గంటలకే ప్రమాదానికి గురైందన్నారు. ప్రమాదానికి గల కారణాలు, విమానం ఎక్కడ కుప్పకూలిందన్న వివరాలు ఇంకా తెలియలేదు. ప్రాణ‌న‌ష్టం భారీగా ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments