సంపూర్ణ మద్య నిషేధం : ఎన్నికల హామీని నిలబెట్టుకున్న ఎంఎన్ఎఫ్

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (14:42 IST)
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని మిజోరం నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) నిలబెట్టుకుంది. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామంటూ ఎన్నికల హామీ ఇచ్చింది. ఇపుడు ఆ హామీని నిలబెట్టుకుంది. 
 
శుక్రవారం సీఎం జొరాంతాంగా నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో మిజోరం లిక్కర్ ప్రొహిబిషన్ బిల్-2019కి ఆమోదం లభించింది. త్వరలో జరుగనున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. 
 
ఈ బిల్లు సభ ఆమోదం పొందగానే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లోకి రానుంది. గతంలో 1997 నుంచి 2015 జనవరి వరకు రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమల్లో ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015 మార్చిలో ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. తిరిగి ఇపుడు నిషేధం విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments