AIతో కష్టాలే.. రిషి సునక్‌తో ఎలెన్ మస్క్ భేటీ.. మానవుడి కంటే తెలివైనది!

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (21:46 IST)
Elon Musk
బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏఐ ప్రమాదాల గురించి చర్చించారు. కృత్రిమ మేధస్సు- AIపై నిబంధనలను అవసరమని పిలుపునిచ్చారు. 
 
"నియంత్రణ నిరుత్సాహపరుస్తుంది, ఇది నిజం, కానీ నియంత్రణ మంచి విషయమని మేము సంవత్సరాలుగా నేర్చుకున్నామని నేను భావిస్తున్నాను." అని ఎలన్ మస్క్ అన్నారు. 
 
సమాచారాన్ని ప్రోత్సహించడానికి సాంకేతికత సామర్థ్యం అవసరమే. అయితే AI భవిష్యత్తు ప్రభావం గురించి పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు మస్క్ అన్నారు. సునాక్‌తో జరిగిన సమావేశంలో,  AIని చరిత్రలో అత్యంత విఘాతం కలిగించే శక్తి"గా అభివర్ణించారు.
 
ఏఐ"తెలివిగల మానవుడి కంటే తెలివైనది" అని మస్క్ తెలిపాడు. ఏఐ కారణంగా ఉద్యోగాలు అవసరం లేని స్థితి వస్తుంది. దీని వల్ల ప్రజలు సుఖంగా ఉంటారా లేదా అన్నది స్పష్టంగా తెలియరాలేదని మస్క్ వెల్లడించారు. 
 
ఇకపోతే, AI వల్ల కలిగే "విపత్తు" హాని గురించి హెచ్చరిస్తూ 28 దేశాలు సంతకం చేసిన ప్రకటనను మస్క్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సంతకం చేసిన దేశాలలో చైనా కూడా చేరింది.
 
 శిఖరాగ్ర సమావేశానికి చైనాను ఆహ్వానించాలనే సునాక్ నిర్ణయం చాలా మంచిదని మస్క్ ప్రశంసించారు.
 
ఈ సంవత్సరం ప్రారంభంలో చైనా పర్యటనలో AI భద్రత గురించి చర్చించామని చెప్పారు. AI భద్రతలో పాల్గొనడానికి చైనా సిద్ధంగా ఉందని మస్క్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments