Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

ఠాగూర్
మంగళవారం, 6 మే 2025 (18:30 IST)
భారత్‌కు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోమారు వార్నింగ్ ఇచ్చారు. తమ భద్రతకు ముప్పు వాటిల్లితే మేం పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగుతాం.. అపుడు అక్కడ మరెవరూ ఉండరు అంటూ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని భారత్ ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. నిషేధిత తహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్, బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు భారత్‌కు కిరాయి సైనికులుగా, ప్రతినిధులుగా పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మా సరిహద్దులకు ఇరువైపులా శత్రువులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 
 
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు దేశాలు ఏ క్షణమైనా యుద్ధానికి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ, తమ దేశ భద్రతకు ఏమాత్రం ముప్పు వాటిల్లినా లేదా భారత్ తమపై దాడికి పాల్పడినా చరిత్రలో నిలిచిపోయేలా తీవ్రంగా ప్రతిస్పందిస్తామని, ఆ తర్వాత అక్కడ ఎవరూ మిగలరని ఆయన హెచ్చరించారు. 
 
కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి భారత్ ఎపుడైనా సైనిక చర్యకు పాల్పడవచ్చని ఆయన హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాని మోడీ ఈ ప్రాంతాన్ని అణుయుద్ధం అంచుకు నెట్టేస్తున్నారని, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ఉగ్రవాదంలో న్యూఢిల్లీ ప్రమేయం ఉందని ఆయన పునరుద్ఘాటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments