Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే ఇంట్లో ఎనిమిది మృతదేహాలు.. ఆరుగురు చిన్నారులు.. అగ్నికి ఆహుతి

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2022 (12:35 IST)
అమెరికాలో ఒకే ఇంట్లో ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. ఆ మృతదేహాలలో ఆరుగురు చిన్నారులు వుండటం విషాదాన్నిచ్చింది. ఒక్లహామా రాష్ట్రంలోని బ్రోకెన్‌ యారో పట్టణంలో ఈ దుర్ఘటన జరిగింది. గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ ఎనిమిది మంది సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. 
 
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఓ వ్యక్తి కారులో వెళ్తుండగా ఆ ఇంటి నుంచి దట్టమైన పొగలు వస్తున్న విషయాన్ని గుర్తించారు. అప్పుడే ఇంటి ముందు ఓ వ్యక్తి స్పృహలో లేని ఒక మహిళను ఈడ్చుకెళ్తూ కనిపించాడని చెప్పారు. 
 
మంటల్లో తగలబడిపోతున్న ఇంట్లో ఉన్న ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments