Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈక్వెడార్ జైల్లో ఘర్షణలు - 68 మంది ఖైదీల మృతి

Webdunia
ఆదివారం, 14 నవంబరు 2021 (19:12 IST)
ఈక్వెడార్ దేశంలోని జైలులో ఖైదీల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో 68 మంది మృత్యువాతపడ్డారు. మరో 25 మంది ఖైదీలకు తీవ్రంగా గాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన గ్వాయాక్విల్‌ నగరంలోని టిటోరల్‌ జైలులో జరిగింది. సెప్టెంబర్‌లో ఇదే జైలులో ఖైదీల మధ్య జరిగిన హింసాత్మక ఘటనలో 119 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. 
 
డ్రగ్స్‌ అక్రమ రవాణా ముఠాల మధ్య వివాదాలే హింసకు కారణంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘర్షణలను అదుపులోకి తెచ్చేందుకు సుమారు వెయ్యి మంది పోలీసులను రంగంలోకి దించారు. 
 
ఖైదీల నుండి పేలుడు పదార్థాలు, తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. జైలు నుండి భారీ పేలుడు రావడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమ వారు బతికే ఉన్నారో లేదో తెలుసుకునేందుకు భారీగా ఖైదీల బంధువులు అక్కడకు చేరుకున్నారు. జైలు వద్ద భయానక పరిస్థితులు నెలకొనివున్నాయి. జైలులో శవాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. 
 
ఘటనా స్థలంలో పేలుడు పదార్థాలు, తుపాకులు గుర్తించి వాటిని సీజ్ చేసినట్లు లిటోలర్ జైలు అధికారి పేర్కొన్నారు. జైలు లోపల నుంచి చాలా సమయం పాటు పేలుళ్లు వినిపించాయని గాయాక్విల్​ నగరంలో లిటోలర్ జైలు సమీప ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు కొందరు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments