Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్ టు భారత్... అండర్ వాటర్ హైస్పీడ్ రైలు.. నిజమా?

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (09:33 IST)
అరబ్ దేశాల్లో ఒకటైన దుబాయ్ - భారత్‌లో మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఇటీవలి కాలంలో మరింతగా బలపడ్డాయి. ఫలితంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ నుంచి భారత్‌కు రైలు మార్గం ఏర్పాటుకానుంది. అదీకూడా సముద్ర భూగర్భంలో ఈ మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ అండర్ వాటర్ హైస్పీడ్ రైలు మార్గం పూర్తయితే చరిత్రపుటలకెక్కనుంది. 
 
దుబాయ్‌లోని ఫుజురాయ్ నుంచి భారత్‌లోని ముంబై వరకు ఈ మార్గాన్ని నిర్మిస్తారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దాదాపు 2 వేల కిలోమీటర్ల వరకు దూరం ఉంది. ఇంతదూరం సముద్రగర్భంలోనే రైలు మార్గం నిర్మించి, ఈ మార్గంలో అండర్ వాటర్ హైస్పీడ్ రైలును నడుపనున్నారు. 
 
ఈ మేరకు యూఏఈకి చెందిన నేషనల్ అడ్వైజరీ బ్యూరో కంపెనీ వెల్లడించింది. ఈ విషయాన్ని సదరు కంపెనీ ఎండీ అబ్దుల్లా అల్‌షేహీ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా బలోపేతం అయ్యేందుకు ఈ ప్రాజెక్టు దోహదం చేయనుందని.. వర్తకం మరింత అభివృద్ది చెందుతుందని అబ్దుల్లా చెప్పారు. 
 
వీటివల్ల ప్రజల అవసరాలతో పాటు ఇరు దేశాల ఎగుమతులు దిగుమతులకు ఈ రైలు మార్గం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటికే ఇటువంటి రైళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చైనా, జపాన్‌లు చూస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

తర్వాతి కథనం
Show comments