Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కామాంధుల వికృతానందం.. మద్యం సేవించి కుక్కపై గ్యాంగ్ రేప్...

Advertiesment
Mumbai
, శనివారం, 24 నవంబరు 2018 (16:10 IST)
ఇటీవల సామూహిక అత్యాచారానికి గురైన కుక్క చనిపోయింది. గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన కామాంధులు పెట్టిన చిత్ర హింసలు, నొప్పి భరించలేకే ఆ శునకం చనిపోయిందని వెటర్నరీ వైద్యులు అంటున్నారు. మహారాష్ట్రలోని మలాడ్ పశ్చిమలో వున్న మల్వానీ ప్రాంతంలో జరిగిన ఈ అమానవీయ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఈనెల 20వ తేదీన మల్వానీ ప్రాంతానికి చెందిన నలుగురు కామాంధులు మద్యం మత్తులో కళ్లు మూసుకుని పోయి అత్యంత హేయంగా కుక్కపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆ శునకాన్ని లైంగికంగా తీవ్రంగా వేధించి వికృతానందం పొందారు. 
 
రోజూ ఇంటికి వచ్చే కుక్క ఆ రోజు ఆహారానికి ఇంటికి రాకపోవడంతో ఓ యువతి వీధిలో వెతుక్కుంటూ వెళ్లింది. అపుడు ఓ చర్చికి సమీపంలో కుక్క మూలుగుతుండం చెవికి వినిపించింది. వెంటనే అక్కడికి చేరుకోగా.. రక్తపు మడుగులో ఉన్న మూగజీవాన్ని చూసి ఆమె షాక్‌కు గురైంది. 
 
తక్షణం తన స్నేహితుల సహకారంతో ఆ కుక్కను సమీపంలో ఉన్న వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. మర్మాయవాల వద్ద తీవ్ర రక్తస్రావం అవుతుండటాన్ని చూసిన వైద్యులు నిర్ఘాంతపోయారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా అమానవీయ విషయం వెలుగులోకి వచ్చింది. శునకంపై మద్యం మత్తులో ఉన్న నలుగురు దుండగులు అత్యాచారం చేశారని తేలింది. శునకం నోరు కట్టేసి.. లైంగికంగా చిత్రహింసలకు గురిచేశారని వెల్లడైంది. ఈ దారుణ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ నలుగురిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్రెండ్‌ను రిలీజ్ చేయలాంటే గెస్ట్‌హౌజ్‌కు రావాలి.. పిలిచి కాటేసిన ఖాకీ