Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాక్ ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి.. సురక్షితంగా ఉన్నానటు కమిది వెల్లడి

Webdunia
ఆదివారం, 7 నవంబరు 2021 (09:20 IST)
ఇరాక్ దేశ ప్రధానమంత్రి ముస్తాఫా అల్-కదిమి నివాసంపై ఆదివారం తెల్లవారుజామున డ్రోన్ల సాయంతో బాంబు దాడి జరిగింది. పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలతో నిండిన ఓ డ్రోన్‌తో బాగ్దాద్‌లోని ఆయన నివాసంపై దాడి జరిగినట్టు భద్రతా దళాలు వెల్లడించాయి. 
 
అయితే, ఈ డ్రోన్ దాడి నుంచి ప్రధాని అల్ కమిది సురక్షితంగా బయటపడ్డారు. కానీ, ఆయన రక్షణ సిబ్బంది పలువురు గాయపడ్డారు. గత నెలలో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో హింస చోటుచేసుకున్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో తాజా దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి ఘటనకు ఇప్పటివరకు ఎవరూ నైతిక బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. డ్రోన్ దాడి జరిగిన ప్రాంతం గ్రీన్ జోన్ కావడం గమనార్హం. 
 
పైగా, ఇక్కడ అనేక ప్రభుత్వ భవనాలు, విదేశీ దౌత్య కార్యాలయాలు ఉంటాయి. ప్రధాని నివాసంపై దాడి ‘ఆరోగ్యకరం’ కాదని  ఇరాక్ మిలటరీ పేర్కొంది. అంతకుమించి వివరాలు వెల్లడించలేదు. ప్రధాని సురక్షితంగా ఉన్నారని, అందరూ సంయమనం పాటించాలని ప్రధాని ట్విట్టర్ ఖాతా పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments