Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాక్ ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి.. సురక్షితంగా ఉన్నానటు కమిది వెల్లడి

Webdunia
ఆదివారం, 7 నవంబరు 2021 (09:20 IST)
ఇరాక్ దేశ ప్రధానమంత్రి ముస్తాఫా అల్-కదిమి నివాసంపై ఆదివారం తెల్లవారుజామున డ్రోన్ల సాయంతో బాంబు దాడి జరిగింది. పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలతో నిండిన ఓ డ్రోన్‌తో బాగ్దాద్‌లోని ఆయన నివాసంపై దాడి జరిగినట్టు భద్రతా దళాలు వెల్లడించాయి. 
 
అయితే, ఈ డ్రోన్ దాడి నుంచి ప్రధాని అల్ కమిది సురక్షితంగా బయటపడ్డారు. కానీ, ఆయన రక్షణ సిబ్బంది పలువురు గాయపడ్డారు. గత నెలలో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో హింస చోటుచేసుకున్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో తాజా దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి ఘటనకు ఇప్పటివరకు ఎవరూ నైతిక బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. డ్రోన్ దాడి జరిగిన ప్రాంతం గ్రీన్ జోన్ కావడం గమనార్హం. 
 
పైగా, ఇక్కడ అనేక ప్రభుత్వ భవనాలు, విదేశీ దౌత్య కార్యాలయాలు ఉంటాయి. ప్రధాని నివాసంపై దాడి ‘ఆరోగ్యకరం’ కాదని  ఇరాక్ మిలటరీ పేర్కొంది. అంతకుమించి వివరాలు వెల్లడించలేదు. ప్రధాని సురక్షితంగా ఉన్నారని, అందరూ సంయమనం పాటించాలని ప్రధాని ట్విట్టర్ ఖాతా పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments