Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న డోనాల్డ్ ట్రంప్!

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (11:41 IST)
అమెరికాలో జనవరి 6వ తేదీన క్యాపిటల్‌ భవనంపై అప్పటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. అయితే, ఆ దాడి తదనంతర పరిణామాలు నేపథ్యంలో ట్విటర్‌, ఫేస్‌బుక్‌ సహా ఇతర వేదికల నుంచి ట్రంప్‌ నిషేధానికి దారి తీశాయి.
 
ఈ నేపథ్యంలో ట్రంప్ తిరిగి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఆయన రీఎంట్రీ ఇవ్వనున్నది అధ్యక్షుడుగా కాదు.. సామాజిక మాధ్యమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. అదేంటి ట్విటర్‌, ఫేస్‌బుక్‌ సహా ఇతర సోషల్‌ మీడియా వేదికలు ఆయన ఖాతాలను నిషేధించాయి కదా! మళ్లీ ఎలా వస్తారనేగా మీ అనుమానం. 
 
అయితే, ట్రంప్‌ ఈ సారి తనను తొలగించిన వేదికల నుంచి కాకుండా.. తానే స్వయంగా మరో కొత్త సామాజిక మాధ్యమ వేదికను ప్రారంభించనున్నారని సమాచారం. రెండు లేదా మూడు నెలల్లో ఆ నూతన వేదికను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. 
 
ఆ కొత్త వేదికగానే ఆయన మళ్లీ నెటిజన్ల ముందుకు రాబోతున్నారని 2020 ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌నకు అధికార ప్రతినిధిగా వ్యవహరించిన జేసన్‌ మిల్లర్‌ మీడియాకు తెలిపారు.
 
‘ట్రంప్‌ మళ్లీ సామాజిక మాధ్యమాల్లో అడుగుపెట్టనున్నారు. ఈ సారి ఆయన తాను సొంతంగా పెట్టబోయే నూతన సామాజిక మాధ్యమ వేదికపైనే ప్రజలకు అందుబాటులోకి రానున్నారు’ అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments