Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ భేష్.. భారత్ అత్యద్భుత ఆర్థిక విజయం సాధించింది: ట్రంప్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. ఫిలిప్పైన్స్‌లో జరిగే ఇండోఆసియన్, ఈస్ట్ ఆసియా సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని మోడీ ఆదివారం బయలు

Webdunia
శనివారం, 11 నవంబరు 2017 (15:44 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. ఫిలిప్పైన్స్‌లో జరిగే ఇండోఆసియన్, ఈస్ట్ ఆసియా సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని మోడీ ఆదివారం బయలుదేరుతారు. ట్రంప్ కూడా ఈస్ట్ ఆసియా సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా ట్రంప్ మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. 
 
భారతదేశం అత్యద్భుతమైన ఆర్థిక విజయం సాధించిందని ట్రంప్ కొనియాడారు. సంస్కరణల ప్రక్రియ, బహిరంగ ఆర్థిక వ్యవస్థతో దేశ ఆర్థిక ప్రగతి యాత్ర సాగుతోందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రధాని మోడీ విస్తారిత దేశంలో ప్రజలందరిని ఒకేతాటిపైకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారని ట్రంప్ కొనియాడారు. 
 
వార్షిక ఆసియా పసిఫిక్ సహకార సదస్సు, సీఈఓల సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, ప్రత్యేకించి భారత్ ప్రగతిని ప్రస్తావించారు. ఇప్పటికే ఆసియా పసిఫిక్ ఆర్థిక కూటమి వెలుపలి దేశాలు కూడా గణనీయంగా కృషి చేస్తున్నాయని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments