Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన రిపబ్లికన్ సభ్యులు...

Webdunia
గురువారం, 14 జనవరి 2021 (10:19 IST)
అమెరికాకు గుండెకాయలాంటి క్యాపిటల్ హిల్‌పై దాడి ఘటన చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ దాడి ఘటనతో అమెరికా ఉలిక్కిపడింది. ఈ దాడి ఘటనతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పదవి నుంచి తొలగించేందుకు డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ఆమోదం లభించింది. ఈ తీర్మానానికి 10 మంది రిపబ్లికన్లు సహా మెజారిటీ సభ్యులు మద్దతు తెలిపారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గత ఏడాది అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో బైడెన్ ఘన విజయం సాధించారు. అయితే ట్రంప్ మాత్రం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ పదేపదే ఆరోపించారు. ఈ క్రమంలో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించడం కోసం ఈనెల 6న కేపిటల్ భవనంలో యూఎస్ కాంగ్రెస్ సమావేశమైంది. 
 
కాగా, ట్రంప్ పిలుపుతో అప్పటికే అక్కడకు చేరుకున్న ఆయన మద్దతుదారులు కేపిటల్ భవనంలోకి చొరబడి బీభత్సం సృష్టించారు. ఈ ఘర్షణల్లో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కేపిటల్ ఘటనకు ట్రంపే కారణం అంటూ ప్రతినిధుల సభ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ తక్షణం దిగిపోవాలని డిమాండ్ చేసింది. అయితే ట్రంప్ దీనికి నిరాకరించిన విషయం తెలిసిందే. 
 
ఈ క్రమంలో భారీ భద్రత నడుమ బుధవారం రోజు ట్రంప్‌ను పదవి నుంచి తొలగించేందుకు దిగువసభలో డెమొక్రాట్లు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. 
 
అనంతరం ఓటింగ్ జరపగా 232 మంది అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. కేవలం 197 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ట్రంప్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి దిగువ సభ ఆమోదముద్ర పడింది. కాగా.. ఈ తీర్మానానికి సెనేట్ కూడా ఆమోదం తెలిపితే.. ట్రంప్ అధ్యక్ష పదవిని కొల్పోతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments