Webdunia - Bharat's app for daily news and videos

Install App

కశ్మీర్‌పై మీ జోక్యం వద్దు.. అమెరికాకు తేల్చిచెప్పిన భారత్

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (07:55 IST)
సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల విదేశాంగ మంత్రుల సదస్సు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో జరుగుతోంది. గురువారం మొదలైన ఈ సదస్సు.. శుక్రవారం రెండోరోజు కొనసాగింది. సదస్సుకు హాజరైన ఆసియాన్ దేశాల విదేశాంగ మంత్రులు తమ దేశాల మధ్య సంఘీభావానికి సూచికగా చేయిచేయి కలిపి ఫొటోలకు పోజులిచ్చారు.
 
 భారత విదేశాంగ మంత్రి జయశంకర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమావేశం అయ్యారు. కశ్మీర్ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వం అంశం ఈ సందర్భంగా చర్చకొచ్చింది. కశ్మీర్ సమస్యను భారత్ – పాకిస్థాన్ రెండు దేశాలు కలిసి చర్చించుకుని పరిష్కరించుకుంటాయని, ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానీ.. మరే దేశం జోక్యం కానీ అవసరం లేదని జయశంకర్ మైకేల్ పాంపియోకు క్లియర్ గా చెప్పారు.
 
 పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ .. అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ట్రంప్ తన కామెంట్స్ తో సంచలనం రేపారు. కశ్మీర్ విషయంలో మీడియేషన్ చేయాలని భారత ప్రధాని, పాక్ ప్రధాని తనను అడిగారని ట్రంప్ చెప్పడంపై పెద్ద దుమారం రేగింది. ట్రంప్ మాట్లాడిన తర్వాత.. భారత్, పాక్ దేశాలు మొట్టమొదటగా చర్చించుకున్నది బ్యాంకాక్ లోని ఆసియాన్ సదస్సులోనే. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లోనే… కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ తోనే తేల్చుకుంటామని.. అమెరికాకు తేల్చిచెప్పింది ఇండియా.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments