అమెరికాలో తెలుగు విద్యార్థులకు బహిష్కరణ భయం.. ఒకరు ఆత్మహత్య?

ఠాగూర్
ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (10:22 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. చట్టబద్ధంగా తమ దేశంలోకి ప్రవేశించనివారి గుండెల్లో ఆయన రైళ్లు పరుగెత్తిస్తున్నారు. ఇలా అక్రమంగా దేశంలో నివసిస్తున్న వారిని గుర్తించి స్వదేశానికి పంపిస్తున్నారు. ఇప్పటికే 250 మంది వరకు స్వదేశానికి వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉంటున్న అనేక మంది ప్రవాస భారతీయులకు బహిష్కరణ భయం పట్టుకుంది. ఇదే భయంతో ఓ తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, మృతుడి వివరాలు మాత్రం తెలియాల్సివుంది 
 
మృతుడి స్నేహితుడి కథనం మేరకు ఆత్మహత్య చేసుకున్న యువకుడి పేరు సాయికుమార్ రెడ్డి. ఉన్నత విద్యను అభ్యసించేందుకు న్యూయార్క్ వెళ్ళాలడు. అక్కడే తాత్కాలికంగా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారి వేట మొదలుపెట్టారు. వీరిని గుర్తించి వెనక్కి పంపుతున్నారు.
 
ఈ క్రమంలోనే సాయికుమార్ రెడ్డి పని చేసే చోట కూడా అధికారులు తనిఖీలు నిర్వహించి, సాయికుమార్ రెడ్డి పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. దీంతో తనను కూడా బష్కరిస్తారన్న భయంతో పనిచేస్తున్న చోటే సాయికుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న్టుట తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments