Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్పీన్స్‌లో రాయ్ తుఫాను విధ్వంసం - 208 మంది మృతి

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (07:31 IST)
ఫిలిప్పీన్స్ దేశంలో రాయ్ తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ధాటికి ఆ దేశంలో అపారమైన ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లింది. ఈ తుఫాను వల్ల ఇప్పటివరకు దాదాపు 208 మంది మృత్యువాతపడ్డారు. మరో 250 మందివరకు గాయపడ్డారు. 52 మంది గల్లంతు అయ్యారు. ఇటీవలి కాలంలో ఈ దేశంలో తుఫాను ధాటికి ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
కాగా, ఆర్చిపెలాగోలేని సౌథర్న్, సెంట్రల్ రీజియన్లలో సుమారు 239 మంది ఈ తుఫాను వల్ల గాయపడ్డారు. మరో 52 మంది గల్లంతయ్యారు. కోస్తా ప్రాంతమంతా తుఫానుధాటికి తుడిచిపెట్టుకుని పోయిందని ఫిలిప్పీన్స్ రెడ్‌క్రాస్ సంస్థ తెలిపింది. 
 
అలాగే దేశంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ బాగా దెబ్బతింది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ తుఫాను వల్ల నిరాశ్రయులైన లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ఆ దేశ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments