Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ మహమ్మారి.. 1,113కి చేరిన మృతుల సంఖ్య.. ఒక్కరోజే?

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (15:14 IST)
కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను మింగేస్తోంది. వైద్యపరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వల్ల ఇప్పటికే 1,113 మందికి ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య లక్షకు చేరువైంది. చైనాలో శుక్రవారం ఒక్కరోజే కరోనా వైరస్ కారణంగా 143 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా మరో 2 వేల 641 మంది ఈ వైరస్ బారినపడ్డారు. డ్రాగన్ కంట్రీలో మొత్తం 66వేల 492మంది కరోనా బాధితులుండగా.. వారిలో 11వేల 82మంది పరిస్థితి విషమంగా ఉంది. 
 
కరోనా వైరస్ కారణంగా చైనాలోని అనేక పట్టణాలు, నగరాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రోజువారీ అవసరాలకు కూడా ప్రజలు రోడ్లమీదికి రావడానికి వణికిపోతున్నారు. రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది.
 
మరోవైపు కరోనా వైరస్‌ అనుమానంతో జపాన్‌ తీరంలో నిలిపేసిన డైమండ్‌ ప్రిన్సెస్‌ ఓడలోని 3వేల711 మందిలో 218 కేసులను పాజిటివ్‌గా గుర్తించగా... వారిలో ముగ్గురు భారతీయులుండటం ఆందోళన రేపుతోంది. ఈ ఓడలోని 138 భారతీయుల్లో 132 మంది సిబ్బంది కాగా, ఆరుగురు ప్రయాణికులున్నారు. దీంతోపాటు ఓడలోని ప్రయాణికుల్లో... కరోనా సోకినట్లు నిర్ధారించిన 11 మంది వృద్ధులను జపాన్‌ అధికారులు బయటకు పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

మా అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు.. పుకార్లు సృష్టించవద్దు : నాగబాబు

Naveen Chandra: మర్డర్ మిస్టరీ నేపథ్యంలో నవీన్ చంద్ర షో టైం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments