Webdunia - Bharat's app for daily news and videos

Install App

దలైలామాలకు కూడా చైనా ముద్ర కావలసిందేనా?

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (15:55 IST)
సాధారణంగా దలైలామా అస్తమించిన తర్వాత కూడా తిరిగి అవతారమెత్తుతారన్నది టిబెట్‌‌లోని బౌద్ధుల నమ్మకం. ప్రస్తుతం ఉన్న దలైలామా రెండేళ్ల బాలునిగా ఉన్నప్పుడు అంతకుముందు వరకు ఉన్న 13వ దలైలామా ఆత్మ ఆయనలో ప్రవేశించిందని టిబెట్‌ బౌద్ధులు విశ్వసిస్తారు. అలాగే, తన తదనంతరం రానున్న 15వ దలైలామా భారతదేశంలోనే పుట్టనున్నారని ప్రస్తుతం ఉన్న 14వ దలైలామా ఓ వార్తా సంస్థతో చెప్పుకొచ్చారు.
 
కాగా, తదుపరి దలైలామా భారత్‌లోనే పుడతారంటున్న ప్రస్తుత దలైలామా వ్యాఖ్యలను చైనా తప్పుబడుతోంది. భారత సంతతికి చెందిన వారిని కాకుండా వేరే వారిని దలైలామాగా నియమించాలని చైనా భావిస్తోంది. 
 
దలైలామాకు వారసునిగా వచ్చే వ్యక్తికి చైనా ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి అని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్‌ షువాంగ్‌ తెలిపారు. చక్రవర్తుల కాలం నుంచి ఇది సంప్రదాయంగా వస్తోందని ఆయన గుర్తుచేశారు. 14వ దలైలామా నియామకం సమయంలో కూడా చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపిందని గెంగ్‌ షువాంగ్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
 
మొత్తం మీద ఈ లెక్కన చూస్తే... దలైలామాలకు కూడా తమ ముద్ర పడవలసిందేననేది చైనా వాదన... మరి ఇది ఏ విధమైన చర్చకు దారి తీస్తుందో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments