Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలిగిన భార్యను సంతృప్తి పరిచేందుకు లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసిన భర్త.. తర్వాత... ఏమైంది...

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (21:59 IST)
అలిగిన భార్యను సంతృప్తి పరిచేందుకు కట్టుకున్న భర్త చేసిన ఓ పనికి ఇపుడు ఆ దంపతులు కోటీశ్వరులయ్యారు. ఇంతకీ ఆ వ్యక్తి చేసిన పనేంటో తెలుసా? భార్యను సంతృప్తి పరిచేందుకు రెండు లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేయడమే. ఈ ఆసక్తికర సంఘటన ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ నగరంలో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ నగరానికి చెందిన ఓ జంట గత మూడు దశాబ్దాలుగా క్రమం తప్పకుండా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఇటీవల తన పేరుమీద లాటరీ టిక్కెట్‌‍ను భర్త కొనుగోలు చేయడం మరిచిపోయాడు. దీంతో ఆమె భర్తపై అలిగింది. ఆమె అలకను తీర్చేందుకు ఆ వ్యక్తి తన భార్య పేరు మీద రెండు లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేశాడు. ఈ లాటరీ టిక్కెట్ల ఫలితాలు గత సోమవారం వెలువడ్డాయి. 
 
ఇందులో ఈ రెండు లాటరీ టిక్కెట్లకు డ్రా తగిలింది. ఒకటి కాదు రెండు కాదు.. ఒక్కో టిక్కెట్‌కు ఏకంగా రూ.8 కోట్లు చొప్పున కలిపి మొత్తం 16 కోట్లు వచ్చిపడ్డాయి. దాంతో ఆ భార్యాభర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ డబ్బుతో తమ కుమార్తెకు కొత్త ఇల్లు కొనిస్తామని, తమ పిల్లల కోసమే కాకుండా వారి పిల్లల కోసం కూడా లాటరీ సొమ్మును వినియోగిస్తామని ఆ దంపతులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments