Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరు వంతెనపై ముద్దుల్లో మునిగి ప్రాణాలు కోల్పోయిన ప్రేమజంట (Video)

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (18:27 IST)
ఓ ప్రేమ జంట ముద్దుల్లో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. తమ విధులు ముగించుకుని అర్థరాత్రి ఇంటికి వెళుతూ వెళుతూ బెత్లహాం(పెరు) వంతెనపై నిలబడి ముద్దుల్లో మునిగిపోయి ప్రమాదావశాత్తు కిందపడి చనిపోయారు. 
 
ఈ ప్రమాద వార్త వివరాలను పరిశీలిస్తే, పెరూ దేశానికి చెందిన మేబిత్‌ ఎస్పింజ్‌(34), హెక్టార్‌ విడాల్‌(36) అనే ఇద్దరు ప్రేమికులు పర్వతారోహకులుగా పని చేస్తున్నారు. వీరిద్దరూ క్యూసో పట్టణంలో పర్యాటక గైడ్లుగా కూడా పని చేస్తున్నారు. అయితే, ఇటీవల ఈ ప్రేమ జంట ముగించుకున్న తర్వాత అర్థరాత్రి ఒంటి గంట సమయంలో తమ నివాసాలకు బయల్దేరారు.
 
మార్గం మధ్యలో ఈ ప్రేమికులిద్దరూ బెత్లెహాం వంతెనపై ఆగి ముద్దుల్లో మునిగిపోయారు. ప్రియురాలు బ్రిడ్జి రెయిలింగ్‌పై కూర్చొని ఉండగా, ప్రియుడు ఆ రెయిలింగ్‌ను సపోర్ట్‌ చేసుకుంటూ నిలబడ్డాడు. 
 
ప్రియురాలికి ప్రియుడు ముద్దు ఇస్తున్న క్రమంలో వారిద్దరూ ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుంచి కిందపడిపోయారు. 50 అడుగుల పైనుంచి కిందపడేసరికి ప్రియురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ప్రియుడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 

 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments