Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 13,915.. యూఏఈలో ఎన్నారైలకు?

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (11:10 IST)
ఇటలీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,15,877కు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ బారిన పడి 53,218 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇటలీలో అత్యధికంగా 13,915 మంది మరణించగా, 1,15,242ల పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. స్పెయిన్‌లో 10,348 మంది, అమెరికాలో 6,088 మంది ఈ వైరస్‌ బారిన పడి మృతి చెందారు.
 
జర్మనీలో మృతుల సంఖ్య 1,107, ఫ్రాన్స్‌లో 5,387 మంది ప్రాణాలు కోల్పోయారు.  ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌ కోరల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నాయి. అగ్రరాజ్యాలను సైతం ఈ వైరస్‌ గడగడలాడిస్తోంది. అటు గల్ఫ్ దేశాల్లోనూ తన ఉనికి చాటుకున్న ఈ మహమ్మారి అక్కడ చాప కింద నీరులా విస్తరిస్తోంది. 
 
ఇక యూఏఈలో కొవిడ్‌-19 విజృంభణతో గురువారం ఒక్కరోజే 210 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు యూఏఈలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1024కి చేరాయి. తాజాగా నమోదైన కొత్త కేసుల్లో వివిధ దేశాలకు చెందిన ప్రవాసులు ఉన్నారని యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం వీరిని ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నామని, కోలుకుంటున్నట్లు యూఏఈ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments