Webdunia - Bharat's app for daily news and videos

Install App

వణికిపోతున్న దక్షిణి కొరియా.. ఒక్క రోజులోనే 300కి పెరిగిన కేసులు

Webdunia
గురువారం, 27 ఫిబ్రవరి 2020 (12:07 IST)
చైనా వెలుపల అత్యధిక స్థాయిలో కరోనా కేసులు దక్షిణ కొరియాలోనే నమోదైనాయి. దక్షిణ కొరియాలో ఇప్పటివరకు 1,261 కరోనా కేసులు నమోదైనాయి. అలాగే దక్షిణకొరియాలో ఉన్న ఒక అమెరికన్ సైనికుడు కూడా వైరస్ బారిన పడ్డాడు.
 
18 మంది కొరియా సైనికులకు కూడా వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో దక్షిణకొరియా కరోనా వైరస్ కారణంగా వణికిపోతోంది. మరోవైపు, అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఇరాన్, ఇటలీ, దక్షిణకొరియాకు వెళ్లొద్దని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. 
 
ఇకపోతే.. కరోనా ప్రభావంతో దక్షిణ కొరియాలోని పలు అగ్రశ్రేణి సంస్థలు మూతపడనున్నాయి. ఒక ఉద్యోగికి వైరస్ సోకడంతో శాంసంగ్ కంపెనీ యూనిట్‌ను మూసేసింది. తాజాగా ఒక్క రోజులోనే దక్షిణ కొరియాలో కరోనా కేసులు ఏకంగా 300 పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 
 
అంతేగాకుండా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న డ్యూగూ నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. పెద్ద ఎత్తున మందులు, రక్షణ పరికరాలను సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణకొరియా ప్రధాని చుంగ్ సె క్యున్ మాట్లాడుతూ, కరోనా వైరస్‌పై పోరాటంలో ఈ వారం అత్యంత కీలకమైనదని చెప్పారు. 
 
ఇకపోతే.. కరోనా ప్రభావంతో దక్షిణ కొరియాకు చెందిన ఎస్కే హైనిక్స్ 800 మందిని ఐసొలేషన్‌లో ఉంచింది. పొహాంగ్‌లో ఉన్న ప్లాంట్‌ను హ్యుందాయ్, ఇంచియోన్‌లో ఉన్న ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని ఎల్జీ సంస్థలు తాత్కాలికంగా మూసేశాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments