Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లోబల్ ఎమెర్జెన్సీని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ-213కి చేరిన కరోనా మృతులు

Webdunia
శుక్రవారం, 31 జనవరి 2020 (12:23 IST)
చైనాను వణికించిన కరోనా ప్రస్తుతం భారత్‌లోకి ప్రవేశించింది. కేరళ రాష్ట్రంలో తొలి కేసు నమోదైంది. మలేషియాలో కరోనాతో ఓ భారతీయుడు మృతి చెందాడు. చైనా నుంచి వచ్చిన వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింది. అటు ఢిల్లీలోనూ పలువురికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించింది.

పలు రాష్ట్రాల్లో కరోనా లక్షణాలతో అనుమానితులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో చైనా నుంచి వచ్చే ప్రతీ ఒక్కరికీ టెస్ట్‌లు జరిపి.. వాటిని పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ విభాగంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ మహమ్మారితో భారత్‌లోకి ప్రవేశించడం.. కేరళలో మొదటి కేసు నమోదు కావడంతో... అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
 
మరోవైపు కరోనా తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గ్లోబల్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ వైరస్‌ విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇంకా చైనాలో రోజు రోజుకు కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది.

కరోనా వైరస్ మృతుల సంఖ్య ఇప్పటివరకు 213కి చేరింది. చైనాలో 9,300 మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే 19 దేశాలకు విస్తరించింది. డబ్ల్యూహెచ్‌వో ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. ప్రపంచ దేశాలు బయో సెక్యూరిటీ భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments