Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్.. ప్రియురాలిని చంపేసిన ప్రియుడు.. ఎందుకంటే?

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (15:56 IST)
కరోనా వైరస్ అంటేనే జనం జడుసుకుంటున్నారు. కరోనాకు దూరంగా వుండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా తనకు కరోనా అంటిందనే అనుమానంతో ఓ యువకుడు తన ప్రియురాలిని హత్య చేశాడు. ఈ ఘటన ఇటలీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిసిలీకి చెందిన లారెనా క్వారెంటా, అంటోనియా డి పేస్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 
 
లారెనా డాక్టర్. ఆంటోనియా మేల్ నర్సుగా పనిచేస్తున్నాడు. ఇద్దరూ ఒకే ఆస్పత్రిలో కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. చెలి సేవలను గతవారం కొనియాడాడు ఆంటోనియా. కానీ ఆ తర్వాత స్వల్పంగా అతను అనారోగ్యానికి గురయ్యాడు.
 
ఇంచుమించు కరోనా లక్షణాలే కనిపించడంతో.. లారెన్ వల్లనే అని అనుమానం పెంచుకున్నాడు. ఆమె ద్వారానే తనకు కరోనా సోకిందని భావించి.. బుధవారం ఇంటిలో నిద్రిస్తున్న లారెన్‌ను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆంటోనియా కూడా మణికట్టు కోసుకుని పోలీసులకు ఫోన్ చేశాడు. 
 
పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాగా రక్తం పోవడంతో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా.. లారెన్, ఆంటోనియాల్లో ఎవరికీ కరోనా లేని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments