Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాలం వస్తే మళ్లీ చైనాలో కరోనా విజృంభిస్తుందట..

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (18:44 IST)
కరోనా బాధితులకు చికిత్స అందించే అత్యవసర పరిస్థితుల్లో వైద్య సిబ్బందిని కాపాడుకునేందుకు ఈ ఏడాది చివర్లో కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు చైనా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. శీతాకాలం మొదలు కాగానే కరోనా వైరస్ మళ్లీ విజృంభించే అవకాశం వుండటంతో వ్యాక్సిన్‌ను సిద్ధం చేసే పనిలో వుంది. చైనాలో మరోసారి వైరస్ విజృంభించే అవకాశం వుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
 
చలికాలం ఆరంభమవ్వగానే పరిస్థితి శ్రుతిమించే ప్రమాదముందని జడుసుకుంటున్నారు. రష్యా సరిహద్దుల్లోని హేలియాంగ్‌జియాంగ్‌లో కేసులు పెరగడం డ్రాగన్‌ను కలవరపెడుతోంది. ఇంకా చైనాలో సోమవారం కొత్తగా 11 కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయని జాతీయ ఆరోగ్య కమిషన్‌ (ఎన్‌హెచ్‌సీ) తెలిపింది. ఇందులో నలుగురు విదేశాల నుంచి రాగా మిగతా ఏడుగురికి దేశంలోనే వైరస్‌ సోకింది.  
 
కరోనా వైరస్‌తో పరిస్థితి అదుపు తప్పితే వైద్యసిబ్బందికి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను ఇస్తామని చైనా వ్యాధి నియంత్రణ సంస్థ డైరెక్టర్‌ గావో ఫు తెలిపారు. సొంత పరిశోధన, అభివృద్ధిని బట్టి ఔషధాలు, టీకాలు రూపొందుతాయని చెప్పారు. ప్రతి ఒక్కరి కృషితో వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments