చైనా - అమెరికాల మధ్య దౌత్య యుద్ధం - హ్యూస్టన్‌లో చైనా ఎంబసీ మూసివేత

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (15:41 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చైనా - అమెరికా దేశాలు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. ఇరు దేశాలు ప్రతీకార చర్యలకు దిగుతున్నాయి. తాజాగా, హ్యూస్టన్‌లోని చైనా రాయబార కార్యాలయాన్ని అమెరికా మూసివేయించింది. 
 
దీనికి ప్రతీకారంగా అమెరికాపై చైనా చర్యలకు దిగింది. చెంగ్డూలోని అమెరికా రాయబార కార్యాలయ నిర్వహణకు ఉన్న అనుమతిని ఉపసంహరిస్తూ ఆ విషయాన్ని అమెరికా అధికారులకు తెలియజేసింది. అంతేకాదు, ఈ నిర్ణయం వెనకున్న కారణాన్ని కూడా వివరించింది.
 
అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా హ్యూస్టన్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేయాలంటూ అమెరికా రెచ్చగొట్టిందని చైనా ఆరోపించింది. అమెరికా తీసుకున్న అన్యాయమైన చర్యలకు ప్రతిస్పందనగా చెంగ్డూలోని అమెరికా దౌత్య కార్యాలయ నిర్వహణకు ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకున్నట్టు అందులో పేర్కొంది.
 
తమ నిర్ణయం మాత్రం అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉందని చెప్పుకొచ్చింది. అమెరికాతో ఇలాంటి పరిస్థితులను తామెప్పుడూ కోరుకోలేదని, ప్రస్తుత ఈ పరిస్థితికి అమెరికాదే బాధ్యత అని నిందించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments