Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా - అమెరికాల మధ్య దౌత్య యుద్ధం - హ్యూస్టన్‌లో చైనా ఎంబసీ మూసివేత

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (15:41 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చైనా - అమెరికా దేశాలు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. ఇరు దేశాలు ప్రతీకార చర్యలకు దిగుతున్నాయి. తాజాగా, హ్యూస్టన్‌లోని చైనా రాయబార కార్యాలయాన్ని అమెరికా మూసివేయించింది. 
 
దీనికి ప్రతీకారంగా అమెరికాపై చైనా చర్యలకు దిగింది. చెంగ్డూలోని అమెరికా రాయబార కార్యాలయ నిర్వహణకు ఉన్న అనుమతిని ఉపసంహరిస్తూ ఆ విషయాన్ని అమెరికా అధికారులకు తెలియజేసింది. అంతేకాదు, ఈ నిర్ణయం వెనకున్న కారణాన్ని కూడా వివరించింది.
 
అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా హ్యూస్టన్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేయాలంటూ అమెరికా రెచ్చగొట్టిందని చైనా ఆరోపించింది. అమెరికా తీసుకున్న అన్యాయమైన చర్యలకు ప్రతిస్పందనగా చెంగ్డూలోని అమెరికా దౌత్య కార్యాలయ నిర్వహణకు ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకున్నట్టు అందులో పేర్కొంది.
 
తమ నిర్ణయం మాత్రం అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉందని చెప్పుకొచ్చింది. అమెరికాతో ఇలాంటి పరిస్థితులను తామెప్పుడూ కోరుకోలేదని, ప్రస్తుత ఈ పరిస్థితికి అమెరికాదే బాధ్యత అని నిందించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments