Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిహద్దుల్లో చైనా బుల్లెట్ రైలు : భారత్ ఏం చేస్తుందో?

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (16:10 IST)
డ్రాగన్ కంట్రీ చైనా సరిహద్దుల్లో బుల్లెట్ రైలును ప్రారంభించింది. సరిహద్దుల్లో ఇప్పటికే బలగాలను మోహరిస్తూ దుందుడుకుగా వ్యవహరిస్తున్న చైనా.. ఇప్పుడు చైనా ఇండో సరిహద్దుల వెంబడి ఈ బుల్లెట్ రైలును నడిపి మరింత రెచ్చగొట్టే చర్యలకు శ్రీకారం చుట్టింది. 
 
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత సమీపంలో ఉండే టిబెట్‌లోని లాసా - న్యింగ్చి ప్రావిన్సులకు శుక్రవారం ఈ బుల్లెట్ రైలును ప్రారంభించింది. జులై ఒకటో తేదీన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సిచువాన్ - టిబెట్ రైల్వేలో భాగమైన 433.5 కిలోమీటర్ల లాసా - న్యింగ్చి సెక్షన్‌ను ప్రారంభించింది.
 
ఇది పూర్తిగా విద్యుత్‌తో నడిచే రైలు అని షిన్హువా వార్తా సంస్థ ప్రకటించింది. ఇప్పటికే టిబెట్లో ఖింగాయ్ - టిబెట్ రైల్వే లైన్‌ను ప్రారంభించిన చైనా.. తాజాగా సరిహద్దుల్లో అత్యంత కీలకమైన అరుణాచల్ ప్రదేశ్‌కు అతి సమీపంలో సిచువాన్ - టిబెట్ రైల్వే మార్గాన్ని నిర్వహణలోకి తెచ్చింది. సరిహద్దు స్థిరత్వానికి దోహదం చేసే ఈ రైల్వే లైన్‌ను వేగంగా పూర్తి చేయాలని గత ఏడాది నవంబర్‌లోనే చైనా ఆదేశించింది. 
 
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ రాజధాని అయిన చెంగ్డూలో ప్రయాణం మొదలుపెట్టే ఈ రైలు.. యాన్, టిబెట్ లోని ఖామ్డో మీదుగా లాసాకు చేరుకుంటుంది. ఈ రైలుతో చెంగ్డూ నుంచి లాసా - న్యింగ్చికి 48 గంటల ప్రయాణం కాస్తా 13 గంటలకు తగ్గనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments