Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిబెట్‌లో తొలి బుల్లెట్ రైలు.. జూలై ఒకటో తేదీన ప్రారంభం

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (12:51 IST)
Bullet Train
టిబెట్‌లో తొట్టతొలి బుల్లెట్ రైలును చైనా ప్రారంభించింది. అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్‌కు సమీపం నుంచి ఈ రైలు మార్గం ఉంది. రాజధాని లాసా నుంచి నింగిచి వరకు రైల్వే మార్గాన్ని కనెక్ట్ చేశారు.

ఈ రైలు మార్గం 435.5 కిలోమీటర్ల దూరం ఉంది. జూలై ఒకటో తేదీన చైనా కమ్యూనిస్టు పార్టీ శతాబ్ధి ఉత్సవాల నేపథ్యంలో ఈ రైలు మార్గాన్ని ఆవిష్కరించారు. ఈ ఎలక్ట్రిక్ రైలు మార్గాన్ని శుక్రవారం ప్రారంభించారు. 
 
ఫుక్సింగ్ బుల్లెట్ రైలును ఈ కొత్త రూట్లో నడిపించారు. ఖిన్‌ఘాయి-టిబెట్ రైల్వే మార్గం తర్వాత.. సిచువాన్-టిబెట్ రైల్వే రెండవ మార్గం కావడం విశేషం. సరిహద్దుల రక్షణ అంశంలో కొత్త రైల్వే లైన్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తెలిపారు. 
 
సిచువాన్- టిబెట్ రైల్వే లైన్‌.. చెంగ్డూ నుంచి ప్రారంభం అవుతుంది. సిచువాన్ ప్రావిన్సు రాజధానియే చెంగ్డూ. ఈ కొత్త రైలు మార్గంతో చెంగ్డూ, లాసా మధ్య ప్రయాణం 48 గంటల నుంచి 13 గంటల వరకు తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments