Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో సరిహద్దు తలనొప్పి : రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచిన చైనా

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (13:11 IST)
ఇటీవలి కాలంలో భారత్, చైనా దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. చైనా బలగాలు హద్దుమీరుతుంటే.. వాటిని భారత్ బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో చైనా తన రక్షణ బడ్జెట్​ను భారీగా పెంచింది. ఈ ఏడాది 209 బిలియన్​ డాలర్లు రక్షణ శాఖకు కేటాయించింది. ఇది గతేడాదితో పోల్చుకుంటే 6.8 శాతం ఎక్కువ. 
 
రక్షణ బడ్జెట్​ను చైనా ఏటికేడు పెంచుకుంటూపోతోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైనిక వ్యవస్థ కలిగిన చైనా‌.. ఈ సంవత్సరం రక్షణ రంగానికి 209 బిలియన్‌ డాలర్లు కేటాయించినట్లు నేషనల్​ పీపుల్స్ కాంగ్రెస్​ పార్టీ (ఎన్​పీసీ) పార్లమెంట్​లో ప్రకటించింది. ఇది భారత రక్షణ బడ్జెట్‌కు మూడు రెట్లు అధికం కావడం గమనార్హం. 
 
ఇది గతేడాదితో పోల్చుకుంటే 6.8 శాతం అధికంగా ఉంది. ఇది ఎవరినీ భయపెట్టడానికి కాదని.. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికేనని చైనా స్పష్టం చేసింది. శాంతియుత అభివృద్ధి, భద్రతా విధానాలకు తమ దేశం కట్టుబడి ఉందని తెలిపింది .ఒక దేశం ఇతరులకు ముప్పు కలిగిస్తుందా లేదా అనేది.. ఆ దేశ రక్షణ విధానంపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments