Webdunia - Bharat's app for daily news and videos

Install App

టార్గెట్ పూర్తి చేయలేదనీ కుక్కల్లా నడిపించారు.. ఎక్కడ? (Video)

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (09:46 IST)
కొన్ని కార్పొరేట్ కంపెనీలు టార్గెట్లు పూర్తి చేయని ఉద్యోగులకు చిత్ర విచిత్ర శిక్షలను విధిస్తున్నారు. తాజాగా చైనాలోని ఓ కంపెనీ తమ సంస్థలో పని చేసే ఉద్యోగులు టార్గెట్లు పూర్తి చేయని కారణంగా కుక్కల్లా నడిపించారు. అదీకూడా పట్టపగలు, అందరూ చూస్తుండగా, నడిరోడ్డుపై ఈ శిక్ష విధించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చైనాలోని షెండోంగ్ ప్రాంతంలో ఓ కార్పొరేట్ కంపెనీ ఉంది. ఇందులో పని చేసే ఉద్యోగులకు రోజువారీ టార్గెట్లను నిర్ధేశిస్తుంది. ఈ టార్గెట్లు పూర్తి చేయని వారికి విచిత్రమైన శిక్షలను అమలు చేస్తోంది. తాజాగా కొందరు సిబ్బంది తమ టార్గెట్లను పూర్తి చేయలేకపోతారు. దీనికి వీరికి శిక్షను విధించింది. 
 
ఈ వీడియోలో ఒక వ్యక్తి ముందు వెళుతున్నాడు. అతను కంపెనీకి సంబంధించిన జెండా పట్టుకున్నాడు. అతనిని అనుసరిస్తూ కొంతమంది నేలకు వంగి (కుక్క మాదిరిగా) నడుస్తున్నారు. దీనిని పోలీసులు గమనించినప్పటికీ అడ్డుకోకపోవడం విశేషం. 
 
ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉద్యోగులను ఇంతలా అవమానపరిచిన కంపెనీని తక్షణమే మూసివేయించాలని డిమాండ్ చేశారు. గతంలో చైనాలోని పలు కంపెనీలు టార్గెట్ పూర్తి చేయని ఉద్యోగుల చేత మూత్రం తాగించడం, బెల్టుతో కొట్టడం, తలను టాయిలెట్ బౌల్‌లో పెట్టడం, మురుగు నీటిని తాగించడంలాంటి హీనమైన పనులు చేయించిన ఉదంతాలు వెలుగు చూసిన విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments