Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో కరోనా వైరస్ మ్యత్యుఘోష.. 1662కి చేరిన మరణాలు

Webdunia
ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (10:40 IST)
కరోనా వైరస్ (కోవిడ్-19) మృత్యుఘోష కొనసాగుతోంది. తాజాగా చైనాలో ఈ వైరస్ మరో 139 మంది ప్రాణాలను బలి తీసుకుంది. మృతులందరూ హుబెయ్ ప్రావిన్స్‌కు చెందినవారే కావడం గమనార్హం. దీంతో మృతులు సంఖ్య 1662కు చేరింది. కాగా, కొత్తగా మరో 1843 మందికి ఈ వైరస్ సోకింది.

ఇక, భార‌త దేశ‌ వ్యాప్తంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య 69 వేలకు చేరింది. అయితే, 9465 మంది ఈ వైర‌స్ బారి నుంచీ బయటపడడం కాస్త ఊరటనిచ్చే అంశం.. కాగా, సింగపూర్‌లో తాజాగా మరో ఐదుగురికి ఈ వైరస్ సోకడంతో ఆ దేశంలో ఆ వైర‌స్ బాధితుల సంఖ్య 72కు చేరింది.
 
మరోవైపు కరోనావైరస్ వ్యాధి (కోవిడ్-19)‌తో ఐరోపాలోనే తొలిసారిగా ఒకరు ఫ్రాన్స్‌లో చనిపోయారు. ఆసియా వెలుపల మొదటి మరణం కూడా ఇదే. మృతుడు చైనా నుంచి వచ్చిన పర్యాటకుడని, ఆయన వయసు 80 ఏళ్లని ఫ్రాన్స్ ఆరోగ్యశాఖ మంత్రి ఆగ్నెస్ బుజిన్ చెప్పారు. ఈ పర్యటకుడు చైనాలోని హుబే రాష్ట్రానికి చెందినవారని తెలిపారు. ఆయన జనవరి 16న ఫ్రాన్స్ చేరుకున్నారని, 25 నుంచి ఆస్పత్రిలో ఒంటరిగా ఉంచామని మంత్రి వివరించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments