Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా వైరస్.. ఒక్కరోజే 108 కేసులు

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (16:35 IST)
చైనాలో రోజురోజుకు నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో ప్రపంచ దేశాలు జడుసుకుంటున్నాయి. వుహాన్ నగరంలో పుట్టి.. ప్రపంచ దేశాలను అట్టుడికింపజేస్తున్న కరోనా వైరస్.. మళ్లీ చైనాలో విజృంభించడం కలకలం రేపుతోంది. 
 
తద్వారా పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుండడంతో అటు ప్రపంచ దేశాలతో పాటు చైనా ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆదివారం ఒక్కరోజే చైనాలో 108 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం మరోసారి భయాందోళనకు గురిచేస్తుంది. దీనితో చైనా ప్రభుత్వం మళ్ళీ చర్యలకు సిద్ధమైంది. 
 
వుహాన్ నగరంలో జంతు మాంసం తినడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెంది నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.... ప్రస్తుతం అటవీ జంతువుల మాంసంపై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. 
 
అయితే చైనాలో నమోదవుతున్న కొత్త కేసులు విదేశాల నుంచి వచ్చిన వారిలోనే బయట పడుతున్నాయని అధికారులు తేల్చారు. చైనాలో ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి మృతి చెందినవారి సంఖ్య 3347 పెరిగింది.

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments