Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గుర్ని కనండి : త్రీ చైల్డ్ పాలసీకి చైనా ఆమోదం..

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (17:25 IST)
డ్రాగన్ కంట్రీ చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు పిల్ల‌ల విధానానికి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది. ఆ చ‌ట్టాల‌ను అమ‌లు చేయాల‌న్న ప‌త్రాల‌పై చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ సంత‌కం చేశారు. 
 
చైనాలో నేష‌న‌ల్ పీపుల్స్ కాంగ్రెస్ 13వ స్టాండింగ్ క‌మిటీ స‌మావేశాలు ముగిశాయి. ఆ పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ప‌లు కీల‌క బిల్లుల‌కు ఆమోదం ద‌క్కింది. ఇందులోనే జనాభా, కుటుంబ నియంత్ర‌ణ చ‌ట్టాన్ని కూడా స‌వ‌రించారు. 
 
చైనా త్రీ చైల్డ్ పాలసీకి ఆమోదం తెలపడానికి కారణాలు లేకపోలేదు. చైనాలో 60 ఏళ్ల వ‌య‌సు దాటిన వారి సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతున్న నేప‌థ్యంలో ఇవాళ ఆ దేశం ముగ్గురు పిల్ల‌ల విధానాన్ని తీసుకువ‌చ్చింది. 
 
గ‌త 40 ఏళ్ల నుంచి ఆ దేశంలో ఒక జంట ఒక్క‌ర్నే క‌నాల‌న్న నిబంధన ఉండేది. ఇప్పుడు జ‌నాభా, కుటుంబ నియంత్ర‌ణ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌తో ఆ సంఖ్య మూడుకు చేరింది.
 
పైగా, ముగ్గురు పిల్ల‌ల్ని క‌నే దంప‌తుల‌కు చైనా ప్ర‌భుత్వం తోడ్పాటు ఇవ్వ‌నుంది. ఫండింగ్‌, ట్యాక్సేష‌న్‌, ఇన్సూరెన్స్‌, ఎడ్యుకేష‌న్‌, హౌజింగ్‌, ఎంప్లామెంట్‌లో వారికి చేయూత‌నివ్వ‌నున్నారు. 
 
ఇది దేశ జ‌నాభా స్వ‌రూపాన్ని మార్చేస్తుంద‌ని, వ‌య‌సు మ‌ళ్లుతున్న వారి సంఖ్య‌కు త‌గిన‌ట్లు కొత్త త‌రం వ‌స్తుంద‌న్నారు. 2020 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం.. చైనా జ‌నాభాలో 60 ఏళ్లు దాటిన వారి సంఖ్య 18.7 శాతంగా వుంది. 
 
2010తో పోలిస్తే ఇది 6 శాతం ఎక్కువ‌గా ఉన్న‌ట్లు అంచ‌నా వేశారు. రెండో బిడ్డ‌ను క‌నేందుకు 2013లో చైనా ఆమోదించింది. పెళ్లి చేసుకున్న దంప‌తులు ఖచ్చితంగా ఇద్ద‌ర్ని క‌న‌వ‌చ్చు అంటూ 2016లో మ‌రో చ‌ట్టం చేశారు. ఇపుడు త్రీ చైల్డ్ పాలసీకి ఆమోదం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments